న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉద్యోగ్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో మెల్లమెల్లగా రాజుకున్న మంటలు ఆ తర్వాత భారీగా ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే పోలీసులకు, ఫైర్ డిపార్టుమెంట్కు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 26 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
#WATCH | Delhi: A fire broke out in a plastic factory near Udyog Nagar metro station. 26 fire tenders have been rushed to the site. No casualties have been reported so far: Delhi Fire Services
(Video Source: Fire Department) pic.twitter.com/V0WWDPPAGl
— ANI (@ANI) October 13, 2023