Amritpal Singh | న్యూఢిల్లీ, మార్చి 30: గత 13 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ గురువారం మరో వీడియోను విడుదల చేశాడు. తానేమీ పరారీలో లేనని, త్వరలోనే వస్తానని తెలిపాడు. యూట్యూబ్లో ప్రసారమైన వీడియోలో దర్శనమిచ్చిన అమృత్పాల్ తాను ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోనని తెగేసి చెప్పాడు.
‘నేనేమీ పరారీలో లేను. కానీ తిరుగుబాటుదారుడి ని. అయినా పారిపోను. త్వరలోనే ప్ర పంచం ముందుకు వస్తా. ప్రభుత్వానికి భయపడటం లేదు. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి’ అం టూ పేర్కొన్నాడు. తాను ప్రస్తుతం ఎం చుకున్న మార్గమంతా పూర్తిగా ము ళ్లతో ఉందని, అయినప్పటికీ దృఢంగా నిలబడాలని ఆ వీడియోలో తన కుటుంబ సభ్యులను ఆయన కోరారు.