భువనేశ్వర్: ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయన్ పాండియన్ సోమవారం అధికార బిజూ జనతాదళ్లో అధికారికంగా చేరారు.
ఇప్పటి వరకు తెర వెనుక ఉండి రాజకీయాలు నడిపిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తికేయన్ పాండియన్.. ఇప్పుడు అధికారికంగా తెరపైకి రావడం గమనార్హం. పార్టీలో నంబర్ 2 స్థానం ఆయనదే అని విశ్లేషకులు చెబుతున్నారు.