న్యూఢిల్లీ: కరోనా ముందటి సంగతేమో కానీ, ఆ తర్వాత మాత్రం గుండెపోటు మరణాలు ఒక్కసారిగా పెరిగాయి. 30 ఏండ్లు కూడా దాటని యువతే కాదు.. చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం చోటుచేసుకున్నాయి. అయితే, విటమిన్-డి సప్లిమెంట్లతో హార్ట్ఎటాక్లను నివారించవచ్చని అధ్యయనం ఒకటి తేల్చింది.
ఎముకల బలానికి అత్యవసరమైన ఈ విటమిన్ శరీరంలో కాల్షియం, ఫాస్ఫేట్ నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడీ సప్లిమెంట్ 60 ఏళ్లు దాటిన వారిలో గుండెపోటు వంటి హృదయ సంబంధ సమస్యల ముప్పును కూడా తగ్గిస్తుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఐదేండ్లపాటు నెలలో ఒకసారి విటమిన్-డిని అధిక డోసు తీసుకున్న వారిలో గుండెపోటు ముప్పు గణనీయంగా తగ్గినట్టు 20 వేల మందిపై జరిపిన పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు.