బెంగళూరు: ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే.. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆటో నడుపుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. తన సొంత నియోజకవర్గం కనకపురలో కాసేపు ఆటో నడిపి ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని పోలింగ్ కేంద్రానికి చేర్చారు. అయితే, ఆయన ఆటో నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కింది వీడియోలో ఆ దృశ్యాన్ని మీరు కూడా వీక్షించండి.
కాగా, కర్ణాటక వ్యాప్తంగా కొన్ని చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మాండ్యా జిల్లాలో మంత్రి నారాయణ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం 30 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
#WATCH | #KarnatakaElections | Karnataka Congress president and party’s candidate from Kanakpura, DK Shivakumar drives an auto in the constituency. pic.twitter.com/pPxoaEZBdi
— ANI (@ANI) May 10, 2023