త్రిస్సూర్ : కేరళ త్రిసూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలకుడి నదిలో నీటిమట్టం భారీగా పెరగ్గా.. నది మధ్యలో ఓ ఏనుగు చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు అధికారులకు సమాచారం అందించారు. నదిలో చిక్కుకుపోయిన ఏనుగును అటవీశాఖ అధికారులు. అగ్నిమాపక సిబ్బంది సైతం ప్రయత్నించినా ఫలించలేదు. ఈ క్రమంలో ప్రవాహంలో కొద్ది దూరం కొట్టుకుపోయింది.
ప్రవాహం మధ్యలో విరిగిపోయిన చెట్టును తొండం సహాయంతో పట్టుకుంది. అనంతరం క్రమంగా నది అవతలి వైపునకు చేరుకుతుంది. ఆ తర్వాత ఏనుగు జాడ కనిపించకుండా పోయింది. అధికారులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని అధికారులు పేర్కొన్నారు. సమీపంలోని గ్రామంలోకి ఆహారం కోసం వెళ్లి.. తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్తున్న సమయంలో గజరాజు నదిలో చిక్కుకుపోయి ఉంటుందని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.