లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వైరల్ ఫీవర్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. వైరల్ జ్వరాలు, డెంగ్యూ బారిన పడిన రోగుల తాకిడి పెరిగినట్లు జిల్లా ఆసుపత్రి వైద్య అధికారి డాక్టర్ పీ కుమార్ తెలిపారు. డెంగ్యూ రోగుల కోసం రెండు వార్డులను రిజర్వ్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 12 మంది డెంగ్యూ రోగులు అడ్మిట్ అయ్యారని, వారికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. సీరియస్గా ఉన్న డెంగ్యూ రోగులకు రక్తం, ప్లేట్లెట్ల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో వైరల్ జ్వరాలతోపాటు డెంగ్యూ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఒక్క ఫిరోజాబాద్లోనే గత రెండు వారాల్లో 60 మందికిపైగా డెంగ్యూతో మరణించారు. గత 48 గంటల్లో 16 మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.