గువాహతి : అసోంలో (Assam Violence) మరోసారి హింసాకాండ భగ్గుమన్నది. అసోం మీదుగా ప్రయాణిస్తున్న ఏడు ట్రక్కులను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి అగ్నికి ఆహుతి చేశారు. ఐదుగురు డ్రైవర్లను సజీవ దహనం చేశారు. దీంతో డిమా హసావో జిల్లాలోని దియుంగ్బ్రా ప్రాంతంలో పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఘటనకు స్థానిక మిలిటెంట్ గ్రూప్ డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ మొదలెట్టాయి. ట్రక్కులు సమీపంలోని సిమెంట్ తయారీ కర్మాగారం కోసం బొగ్గు, ఇతర వస్తువులను తీసుకెళ్తున్నాయి.
అందిన సమాచారం మేరకు, అనుమానిత మిలిటెంట్లు అధునాతన ఆయుధాలతో ట్రక్కు డ్రైవర్లపై అనేక రౌండ్ల కాల్పులు జరిపారు. పలువురు డ్రైవర్లు, ట్రక్కుల అసిస్టెంట్లు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఐదు మృతదేహాలను వెలికితీసింది. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ డీఎన్ఎల్ఏ హస్తం ఉండవచ్చని అసోం పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు. దుండగులను పట్టుకోవడానికి అసోం రైఫిల్స్ సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. గువాహతికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. మే నెలలో భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఆరుగురు డీఎన్ఎల్ఏ సభ్యులు చనిపోయారు.
చారిత్రాత్మకంగా నిలిచిన ప్రిన్సెస్ డయనా విడాకులు
రాణె తల నరికి తెస్తే 51 లక్షల రివార్డ్ : విశ్వ హిందూ సేన
7,200 ఏండ్ల క్రితం మహిళ శరీరంలో డీఎన్ఏ గుర్తింపు
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..