ముంబై: విజయ్ మాల్యా(Vijay Mallya) గురించి సీబీఐ తాజాగా కొన్ని విషయాలను చెప్పింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన 330 కోట్లు పెట్టి ప్రాపర్టీ(properties)లను సొంతం చేసుకున్నట్లు తెలిపింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్(Kingfisher Airlines) సంస్థ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న సమయంలోనే ఆయన ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు సీబీఐ తన రిపోర్టులో పేర్కొన్నది. ఇటీవల సీబీఐ ఆ కేసులో అదనపు ఛార్జిషీట్ను దాఖలు చేసింది. మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ సంస్థ ఐడీబీఐ బ్యాంకుకు 900 కోట్లు ఎగవేసిన విషయం తెలిసిందే. ఫ్రాడ్ కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ చేపడుతున్నది.
గత ఛార్జిషీట్లో 11 మంది నిందితుల పేర్లను సీబీఐ పొందుపరిచింది. తాజాగా ఆ లిస్టులో బుద్దదేవ్ దాస్గుప్తా(Buddhadev Dasgupta) పేరును చేర్చారు. ఐడీబీఐ బ్యాంకులో అతను జనరల్ మేనేజర్గా చేశారు. దాస్గుప్తా తన హోదాను వాడుకుని అక్రమరీతిలో మాల్యాకు 2009లో సుమారు 150 కోట్ల రుణం ఇచ్చినట్లు సీబీఐ తన రిపోర్టులో ఆరోపించింది.