Viral Video | రైల్వే ప్లాట్ఫామ్పై (Railway Platform) నిద్రిస్తున్న వారిపై ఓ పోలీసు (Cop) బాటిల్ తో నీళ్లు పోశారు. పూణే రైల్వే స్టేషన్ (Pune Railway Station) లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ వీడియోను రూపన్ చౌదరి అనే నెటిజన్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘రిప్ హ్యుమానిటీ.. పూణే రైల్వే స్టేషన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘రైళ్లు సమయానికి వస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తదు కద..’ , ‘ప్రభుత్వం వెయిటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేయాలి. అప్పుడు ఇలా ప్లాట్ ఫారమ్ పై పడుకోవలసిన అవసరం రాదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఘటనపై పూణే డివిజనల్ రైల్వే మేనేజర్ (Pune Divisional Railway Manager) ఇందు దుబే (Indu Dubey) స్పందించారు. ఈ సంఘటన చాలా విచారకరం అని పేర్కొన్నారు. ‘ప్లాట్ఫామ్పై పడుకోవడం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ప్రయాణికుల పట్ల పోలీసు ప్రవర్తించిన తీరు సరైంది కాదు. సిబ్బంది తగిన విధంగా ప్రయాణికులకు సూచించాల్సి ఉంటుంది. పోలీసు ప్రవర్తించిన తీరు విచారకరం’ అని ఇందు దుబే పేర్కొన్నారు.
Shocking #viralvideo from the Pune Railway Station.
A police officer pours water on sleeping passengers at the Pune railway station. #VandeBharatExpress #emeutes #earthquake #CarryOnJatta3 #DoctorsDay #BusAccident #FranceRiots #TejRan pic.twitter.com/Epij9KKZ3o— Tulip Siddiq (@SiddiqTulip) July 1, 2023
Also Read..
Allan Border | పార్కిన్సన్ వ్యాధి బారిన పడిన క్రికెట్ దిగ్గజం.. 80 ఏళ్లు జీవిస్తే అద్భుతమే అంటూ..
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం.. ఇంకా 52 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది
Durga Mata | ఈద్ పండుగ నాడు దుర్గామాతగా పూజలందుకున్న ముస్లిం బాలిక.. ఎక్కడంటే