న్యూఢిల్లీ : మెట్రో రైలు కోచ్ల్లో వీడియోలను రికార్డు చేయరాదని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) పలుమార్లు హెచ్చరించినా పలువురు ప్రయాణీకులు మెట్రో రైళ్లలో రికార్డు చేసిన వీడియోలను (Viral Video) నెట్టింట వైరల్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్గా ఢిల్లీ మెట్రో కోచ్ లోపల ఓ మహిళ బాలీవుడ్ సాంగ్కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
ఈ వైరల్ వీడియోలో బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన యువతి నేహ బాసిన్, బప్పీలహరి సాంగ్ అస్లాం-ఇ-ఇష్కమ్ సాంగ్కు హుషారైన డ్యాన్స్ మూమెంట్స్తో దుమ్ము రేపింది. షార్ట్ క్లిప్లో కనిపించిన మహిళను ప్రియా శర్మగా గుర్తించారు. ఈ వీడియోను ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. ఆమె ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ కొందరిని ఆకట్టుకోగా, డీఎంసీఆర్ ఇన్స్టాగ్రాం ఖాతాకు ఈ పోస్ట్ను పలువురు ట్యాగ్ చేసి ఇలాంటి వారిపై తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
మరోసారి ట్రైన్లో ఇలా చేయవద్దని ఓ యూజర్ కామెంట్ చేయగా, మెట్రో రైళ్లలో ఇలాంటివి ఆపాలని మరో యూజర్ కోరారు. అయితే ప్రతి విషయానికి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారని మరో యూజర్ మహిళను సమర్ధిస్తూ కామెంట్ చేయగా అసలు ఇంత జరుగుతుంటే సీఐఎస్ఎఫ్ వారు ఎక్కడున్నారని మరో యూజర్ నిలదీశారు.
Read More