అహ్మదాబాద్, ఏప్రిల్ 21: గోద్రా ఘటన నేపథ్యంలో గుజరాత్లో జరిగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ కేసుల విచారణల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడం సంచలనం సృష్టించడమే కాక, మిగిలిన కేసులు కూడా ఇదే బాటపడతాయా? అన్న అనుమానాలను బాధిత కుటుంబాలు వ్యక్తం చేస్తున్నాయి.
అందరూ నిర్దోషులే అయితే తమవారిని ఎవరు పొట్టన పెట్టుకున్నారని నిలదీస్తున్నాయి. 11 మంది ముస్లింలను హతమార్చిన నరోదగామ్ ఊచకోత కేసును విచారించిన ప్రత్యేక కోర్టు గుజరాత్ మాజీ మంత్రి కోద్నానీ సహా 67 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ గురువారం ఇచ్చిన తీర్పును గుర్తుచేశాయి.