లక్నో: 18 ఏండ్లు పైబడి మొదటిసారి ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో భౌతికంగా వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరవ్వాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రకటించింది.
తొలిసారి ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొనేవారి కోసం ప్రతి జిల్లాలోని ప్రధాన తపాల కార్యాలయంతోపాటు యూఐడీఏఐ గుర్తింపు పొందిన ఎంపిక చేసిన ఆధార్ కేంద్రాల్లో సేవలు అందిస్తామని చెప్పింది.