భువనేశ్వర్: ఒడిశాకు తొలి వందేభారత్(22895/22896) రైలు వచ్చేసింది. పూరి నుంచి హౌరా వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express)ను ఇవాళ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ఆ రైలును స్టార్ట్ చేశారు. హై స్పీడ్ వందేభారత్ వారానికి ఆరు రోజులు నడవనున్నది. గురువారాలు ఈ ట్రైన్ ఉండదు. పూరి-హౌరా రైలుకు మొత్తం ఏడు స్టాప్లు ఉన్నాయి. 16 కోచ్లు ఉండే ఈ రైలు ఉదయం 6.10 నిమిషాలకు హౌరాలో ప్రారంభం అవుతుంది. ఇక పూరికి మధ్యాహ్నం 12.35 నిమిషాలకు చేరుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూరి నుంచి 1.50 నిమిషాలకు బయలుదేరి.. రాత్రి 8.30 నిమిషాలకు హౌరా చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఖరగ్పూర్, బాలసోర్, భద్రక్, జాజ్పూర్-కియోజాన్ రోడ్డు, కటక్, భువనేశ్వర్, కుర్దా రోడ్డులు ఈ రైలు ఆగుతుంది. ప్రతి స్టేషన్లో రెండు నిమిషాలు మాత్రమే ట్రైన్ ఆగనున్నది.