న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ వేగంగా సాగుతున్నది. గురువారం నాటికి దేశంలో 115కోట్లు దాటింది. కొవిన్ పోర్టల్ ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు 115,07,92,670 టీకాలు వేశారు. ఇందులో 76,11,67,300 మందికి మొదటి, 38,96,25,370 మందికి రెండోమోతాదు వేశారు. దేశవ్యాప్తంగా 97,633 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు టీకాల కోసం 82.42కోట్లకుపైగా రిజర్వేషన్లు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లో ఎక్కువ మంది రెండుమోతాదుల టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకు 2.75కోట్లకుపైగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోగా.. అదే సమయంలో 5.04కోట్ల మందికిపైగా తొలిడోసు వేశారు.