ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి జైల్లో నుంచే అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఆయనే సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజమ్ ఖాన్. ప్రస్తుతం సీతాపూర్ జైల్లో ఉన్న ఆయన యూపీలోని రాంపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల కేసులో ఆయన అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన కుమారుడు కూడా సువర్ తండా నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు.
ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా 4 వేలపైగా ఓట్లతో ఉంటే.. ఆజమ్ ఖాన్ ఇక్కడ 32 వేలపైగా ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు ప్రస్తుతం 36 వేలపైగా ఓట్లు ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం యూపీలో బీజేపీ 250 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఎస్పీ 110 సీట్లలోనే ముందంజలో ఉంది.