యమునోత్రి జాతీయ రహదారి సేఫ్టీ వాల్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో అటు వైపు వెళ్తున్న 10 వేల మంది ప్రయాణికులు రోడ్లపైనే చిక్కుకుపోయారు. కొండ చరియలు ఒక్కసారిగా విరిగి పడటంతో ఈ ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ రహదారులను పునరుద్ధరించడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే చిన్న చిన్న వాహనాలను పంపడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాల్లో ఉన్న యాత్రికులకు మాత్రం ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు.
మరో వైపు పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో చార్ధామ్ యాత్రా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వ్యక్తులెవ్వరూ హృషీకేశ్ రావొద్దని సూచనలు ఇచ్చారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల దాదాపు 10 వేల మంది అక్కడే ఇరుక్కుపోయారు. దీంతో హోటళ్లు, ధర్మశాలలు, సత్రాలు ఎక్కడికక్కడ నిండిపోయాయి.