డెహ్రాడూన్: అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడటంతో ఉత్తరాఖండ్ రాజకీయ వేడి రాజుకున్నది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతల కప్పగంతులు, కుప్పిగంతులు మొదలయ్యాయి. తాజాగా పురోలా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ( Congress MLA ) రాజ్కుమార్ అధికార బీజేపీలో జంప్ అయ్యారు. ఈ ఉదయం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ ఎమ్మెల్యే రాజ్కుమార్కు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి, ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌషిక్ కూడా పాల్గొన్నారు.