Uttar Pradesh | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): అమెరికాలో పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతి శాంతి భద్రతలను ప్రశ్నార్ధకం చేస్తూ అక్కడి పోలీసులకు సవాల్గా మారింది. ఆ తుపాకీ సంస్కృతి ఇప్పుడు క్రమంగా భారత్లోకి పాకుతున్నది. దేశంలో అత్యధికంగా లైసెన్స్డ్ తుపాకులు ఉన్న రాష్ట్రంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ తొలిస్థానంలో ఉన్నది. యూపీలో ప్రతీ 200 మందిలో ఒకరి దగ్గర తుపాకీ ఉన్నదని సమాచారం.
ఈ మేరకు ఓ ఆర్టీఐ ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఈ జాబితాలో జమ్ముకశ్మీర్, పంజాబ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తుపాకీ వాడకానికి దరఖాస్తులు పెరుగుతున్నాయంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఎక్కువగా ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. లైసెన్స్డ్ గన్స్ జాబితాలో తెలంగాణ చివరి స్థానాల్లో ఉన్నది. రాష్ట్రంలో ప్రతీ 5 వేల మందిలో ఒకరికి లైసెన్స్డ్ గన్ ఉన్నట్టు తేలింది.