న్యూఢిల్లీ : (Omar Abdullah) ఉత్తరప్రదేశ్ను నయా జమ్ముకశ్మీర్గా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అభివర్ణించారు. సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా ‘ఉత్తర్ప్రదేశ్ ఈజ్ ది ‘నయా జేఅండ్కే’ అని రాశారు. ఉత్తర్ప్రదేశ్లో తాజాగా ఆందోళనలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఓమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తున్నది.
ఓమర్ కన్నా ముందు, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ‘మానవ హక్కులు, గౌరవాన్ని తుంగలో తొక్కిన చోట సెక్షన్ 144 ను అమలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం. ఈ ప్రభుత్వం తన సొంత ప్రజలపై ఉక్కు పిడికిలిని వినియోగించడంలో సంకోచించడంలేదు. అదే చైనా సైనికులు వస్తే చేతులు ముడుచుకున్నది’ అని మెహబూబా ట్వీట్లో రాశారు. 2019 నుంచి జమ్ముకశ్మీర్లో జరిగిన అణచివేతను ఎవరూ పోల్చలేరన్నారు. జమ్ముకశ్మీర్లో ప్రారంభమైన దురదృష్టకర వాతావరణం దేశం మొత్తాన్ని చుట్టుముట్టిందని ఆమె పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితిలో వాజపేయి హిందీ ప్రసంగం
ఈ గాజు మహా బలమైనది.. ఫోన్ స్క్రీన్లుగా వస్తే పగిలే సమస్య ఉండదంట!
సరిహద్దులో తాలిబాన్ ఆత్మాహుతి దళాల ప్రత్యేక బెటాలియన్
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..