Yogi Adityanath : రోడ్లపై నమాజ్ చేసే విషయంలో ముస్లింలకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరిక జారీ చేశారు. యూపీలో ఇకపై రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లక్నోలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్లను బ్లాక్ చేసి, నమాజ్ చేయడం సరికాదని సూచించారు. చట్టం అందరికీ సమానమే అన్నారు.
‘‘అందరూ నన్ను అడుగుతుంటారు. ఉత్తర ప్రదేశ్లో ప్రజలు రోడ్లపై నమాజ్ చేయరా అని. అలాంటిది ఇక్కడ ఉండదని చెబుతుంటా. కావాలంటే వెళ్లి చూడమని చెబతా. రోడ్లు ఉన్నవి రవాణా కోసం. ఎవరైనా రోడ్ల మీదకు వచ్చి ట్రాఫిక్ అడ్డుకోవాలని చూశారా..? ఇబ్బంది పెట్టారా..? రోడ్లపై ప్రజలు వెళ్లకుండా అడ్డుకునే హక్కు ఎవరికైనా ఉందా..? కొంతమంతి అడుగుతుంటారు.. తాము ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా నమాజ్ చేయకుండా ఉండటం సాధ్యం కాదు కదా అని. మీ ఇంట్లో అంత స్థలం లేకపోతే.. దానికి అనుగుణంగా జనాభా తగ్గించుకోండి. అనవసరంగా జనాభా పెరగడాన్ని తగ్గించుకోవాలి. ప్రభుత్వ నిబంధన అంటే.. అది చట్టమే. అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. నమాజ్ తప్పనిసరి. కానీ, మీ షిఫ్టుకు అనుగుణంగా చేసుకోండి. మేం ఆపం. కానీ, రోడ్లపై నమాజ్ చేయొద్దు” అంటూ యోగి వ్యాఖ్యానించారు.
नमाज पढ़नी है, आप शिफ्ट में पढ़िए…
प्यार से मानेंगे ठीक है, नहीं मानेंगे तो दूसरा तरीका अपनाएंगे… pic.twitter.com/zDoz6YiqTZ
— Yogi Adityanath (@myogiadityanath) May 18, 2026
ముస్లింలు జనాభాను నియంత్రించుకోవాలని సూచించారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో పర్యటన సందర్భంగా కూడా యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ, వాటిని టీఎంసీ పార్టీ ఖండించింది. ఇక, సీఎం యోగి తాజా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.