UP DGP : ఉత్తర ప్రదేశ్ నూతన డీజీపీగా రాజీవ్ కృష్ణ నియామకమయ్యారు. నాలుగేళ్ల తర్వాత యూపీకి పర్మినెంట్ డీజీపీ నియామకమవ్వడం విశేషం. 2022 వరకు యూపీలో పర్మినెంట్ డీజీపీనే ఉండేవారు. చివరి పూర్తిస్థాయి డీజీపీగా ముకుల్ గోయెల్ ఉండేవారు.
అప్పట్లో ఆయనను ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత నుంచి యూపీలో తాత్కాలిక డీజీపీలనే ప్రభుత్వం నియమిస్తూ వస్తోంది. డీఎస్ చౌహాన్, ఆర్కే విశ్వకర్మ, విజయ్ కుమార్లు డీజీపీలుగా పని చేశారు. చివరగా 2025 మే నెలలో ప్రశాంత్ కుమార్ను తాత్కాలిక డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు ఆయన స్థానంలో రాజీవ్ కృష్ణ పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగుతారు. ఆయన 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన వారు. ఆయన మరో మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 2029 జూన్లో రిటైర్ అయ్యే వరకు ఆయనకు పదవీ కాలం ఉంది.
ఇప్పటివరకు రాజీవ్ కృష్ణ విజిలెన్స్ విభాగం డీజీగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన పోలీస్ రిక్రూట్మెంట్ను పకడ్బందీగా నిర్వహించారు. అలాగే, యాంటీ టెర్రర్ స్క్వాడ్కు నేతృత్వం వహించారు. దేశంలోనే అత్యధిక పోలీసులు కలిగిన రాష్ట్రం యూపీనే.