న్యూఢిల్లీ : భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి దేశీ వంటకాలను టేస్ట్ చేస్తూ తన ఫుడ్ జర్నీకి సంబంధించిన వీడియోలను (Viral Video) సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేస్తుంటారు. లేటెస్ట్గా ఆయన బెంగాలీ వంటకాలను ఆరగిస్తున్న వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
ఎరిక్ ఇటీవల ఢిల్లీలోని బంగా భవన్ను సందర్శించి మచర్ పటూరి ( అరటి ఆకుల్లో వండిన చేప), మిస్తి దో, రసగుల్లా, బనానా ఫ్లవర్ కట్లెట్, లుచి, బసంతి పులావ్, దాల్ వంటి ప్రముఖ బెంగాలీ డిష్లను ఆస్వాదించారు. బెంగాలీ వంటకాలను టేస్ట్ చేయడంతో పాటు బెంగాలీ ప్రముఖులతో కలిసి మాటామంతీ నిర్వహించారు. బెంగాలీ సంస్కృతిని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
Nomoskar from Banga Bhawan in Delhi! From legendary macher paturi to sweetness overload mishti doi and roshogollas, today I experienced the flavors of Kolkata’s culinary wonders. I must say, Indian food culture never ceases to amaze me. See you soon, Kolkata! #AmbExploresIndia pic.twitter.com/wA5Y56F8Qz
— U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) July 3, 2023
సంగీతం గురించి కూడా బెంగాలీలతో ఆయన ముచ్చటిస్తూ గ్రేట్ ఫిల్మ్మేకర్ సత్యజిత్ రే గురించి ప్రస్తావించారు. ఢిల్లీ బంగా భవన్ నుంచి నమస్కారాలు! ఈరోజు కోల్కతా రుచులను ఆస్వాదించా..త్వరలో కోల్కతాలో కలుసుకుందాం! అని ఈ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఇండియన్ ఫుడ్ పట్ల అంబాసిడర్ గార్సెట్టి ఆదరణను పలువురు యూజర్లు ప్రశంసించారు.
Read More :
మేకను బలి ఇచ్చాడు..ఆపై తానే బలయ్యాడు..!