రాయ్పూర్ : చత్తీస్ఘడ్కు చెందిన ఓ వ్యక్తి మేకను బలి ఇవ్వగా ఆపై అతడి చావుకు మేక కారణమైంది. సూరజ్పూర్ జిల్లాకు చెందిన 50 ఏండ్ల బగర్ సై తన కోరికలు నెరవేరడంతో ఓ ఆలయంలో మేకను బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
బగర్ సై మదన్పూర్ గ్రామస్తులతో కలిసి కోప ధామ్ చేరుకుని అక్కడ మేకను బలి ఇచ్చాడు. ఆ తంతు ముగిసిన వెంటనే గ్రామస్తులు మేక మాంసం వండి భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు. బగర్ మేక కన్నును మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది.
దాన్ని బయటకు ఉమ్మేందుకు విఫల యత్నం చేశాడు. ఆపై శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
Read More :
China Youth | చైనా యువత బెంబేలు.. వయసు 35 దాటితే ఉద్యోగం ఊస్ట్