భోపాల్: కాంగ్రెస్ ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయిందని, ఆ పార్టీని అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని
మోదీ విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో మంగళవారం ఆయన పర్యటించారు.
భోపాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. నినాదాల దగ్గర నుంచి విధానాల వరకు కాంగ్రెస్ ప్రతిదానికీ పొరుగు సేవలను వాడుకుంటున్నదని, క్షేత్ర స్థాయి నేతలు నోటికి తాళాలు వేసుకున్నారని అన్నారు.