బెంగళూరు: వివాహ వార్షికోత్సవం రోజున భర్త ఎలాంటి గిఫ్ట్ ఇవ్వకపోవడంపై భార్య మనస్తాపం చెందింది. రాత్రి వేళ నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచింది. (Wife stabs sleeping husband) తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల రియా ఘోష్, 37 ఏళ్ల పార్థ ప్రతిమ్ పాత్ర భార్యాభర్తలు. ఫిబ్రవరి 27న వారి వివాహ వార్షికోత్సవం. అయితే పెళ్లి రోజున భర్త పార్థ ఎలాంటి బహుమతి ఇవ్వకపోవడంపై భార్య రియా తీవ్ర మనస్తాపం చెందింది. ఈ నేపథ్యంలో ఆ రాత్రి వేళ బెడ్పై నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచింది.
కాగా, భార్య రియా కత్తితో దాడి చేయడాన్ని గమనించి భర్త పార్థ షాకయ్యాడు. వెంటనే తేరుకున్న అతడు మరోసారి కత్తితో పొడిచేందుకు సిద్ధమైన భార్యను పక్కకు తోశాడు. కత్తి పోట్ల వల్ల గాయపడటంతో పొరుగువారి సహాయంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు భార్య రియాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.