అలహాబాద్: ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు కార్మికుల సమ్మెపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె వల్ల విద్యుత్తు ఉత్పత్తి తగ్గడం జాతీయ ప్రయోజనాలను ఫణంగా పెట్టడమేనని పేర్కొంది. గత డిసెంబరులో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తామిచ్చిన ఆదేశాలను ధిక్కరించారని కోర్టు పేర్కొన్నది. సమ్మె నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ విద్యుత్తు కర్మచారి సంయుక్త్ సంఘర్ష్ సమితికి చెందిన 29 మంది నాయకులకు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.