లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి లఖీంపూర్ ఖేరీ వెళ్లడానికి యూపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఆయనను లక్నో ఎయిర్పోర్ట్లోనే ఆపేశారు పోలీసులు. ఆయనతోపాటు పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ కూడా ఉన్నారు. దీనిపై ఎయిర్పోర్ట్లోనే రాహుల్ మీడియాతో మాట్లాడారు. అసలు నాకు ఎలాంటి అనుమతి ఇచ్చారు. వీళ్లు నన్ను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లనీయడం లేదు అని రాహుల్ అన్నారు.
రాహుల్, ప్రియాంకాలతోపాటు మరో ముగ్గురికి లఖీంపూర్ వెళ్లడానికి బుధవారం ఉదయం యూపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఢిల్లీ నుంచి విమానంలో లక్నో చేరుకున్నారు రాహుల్ గాంధీ. అయితే తనను ఎయిర్పోర్ట్లోనే ఆపేయడంతో.. ఇదీ బీజేపీ ప్రభుత్వ అనుమతి. వాళ్లు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? అని ట్వీట్ చేశారు.