లక్నో : యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి రాకేష్ సచన్ ఓటర్లను ఉద్దేశించి మీకు మద్యం కావాలా..అధికారం కావాలా తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఘటంపూర్లో నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మీకు మద్యం కావాలంటే అవతలి పక్షం వైపు వెళ్లాలని..మీకు అధికారం కావాలనుకుంటే అవినాష్ చౌహాన్కు మద్దతు ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు.
కాన్పూర్ నగర్ జిల్లాలోని ఘటంపూర్ను సందర్శించిన క్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పట్టణంలోని సచన్ గెస్ట్ హౌస్ వద్ద మంత్రి కాన్వాయ్కు పార్టీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లబించింది. భోగ్నిపూర్ స్ధానం నుంచి బరిలో నిలిచి గెలిచిన రాకేష్ సచన్కు యోగి క్యాబినెట్లో చోటు దక్కింది.
కాగా కాన్పూర్ జిల్లా నుంచి ఏ ఒక్కరికీ మంత్రివర్గంలో స్ధానం దక్కకపోవడంపై ఆయన మాట్లాడుతూ పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని పేర్కొన్నారు. కాగా యూపీ విధాన మండలిలో 30 స్ధానాలకు గాను రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.