లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కాల్పుల హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా దళిత విద్యార్థినిని ఇద్దరు వ్యక్తులు గన్తో కాల్పులు జరిపి హత్య (Dalit Student Shot Dead) చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఇది జరుగడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల రోష్ని అహిర్వార్, బీఏ రెండో ఏడాది చదువుతున్నది. సోమవారం ఉదయం జలౌన్లోని రామ్ లఖన్ పటేల్ మహావిద్యాలయానికి వెళ్లి పరీక్ష రాసింది. అనంతరం ఉదయం 11 గంటలకు కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నది. ఇద్దరు వ్యక్తులు బైక్పై ఆమె వద్దకు వచ్చారు. ఒక వ్యక్తి దేశీయ తుపాకీతో రోహ్ని తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె రక్తం మడుగుల్లో పడి అక్కడికక్కడే చనిపోయింది.
కాగా, రోడ్డుపై ఉన్న వారు ఈ సంఘటన చూసి షాక్ అయ్యారు. విద్యార్థిని రోహ్నిపై గన్తో కాల్పులు జరిపిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే నిందితులు తుపాకీని వారి మీదకు విసిరి అక్కడి నుంచి పారిపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలో ఈ సంఘటన జరుగడం స్థానికంగా కలకలం రేపింది.
మరోవైపు, కాల్పుల్లో తమ కుమార్తె చనిపోయిన సంగతి తెలుసుకుని దళిత విద్యార్థిని తల్లిదండ్రులు షాక్ అయ్యారు. రాజ్ అహిర్వార్ అనే వ్యక్తిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. విద్యార్థిని రోహ్నిని గన్తో కాల్చి చంపిన నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాల్పుల్లో మరణించిన దళిత విద్యార్థిని రోహ్ని మృతదేహం పక్కనే గన్ కూడా పడి ఉన్నది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై నెటిజన్లు మండిపడ్డారు. యూపీలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ను విమర్శించారు. గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడ్ని పోలీసుల సమక్షంలో మీడియా ఎదుటే ముగ్గురు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపి హత్య చేసిన రెండు రోజుల్లోనే ఈ సంఘటన జరుగడంపై మండిపడ్డారు.
బీహార్ ప్రభుత్వంలో భాగమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కూడా ఈ వీడియో క్లిప్ను ట్విట్టర్లో షేర్ చేసింది. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ చావుపై కూడా గోడీ మీడియా తోడేళ్లు, బీజేపీ సంబరాలు చేసుకుంటారా?’ అని ప్రశ్నించింది.
उत्तर प्रदेश के जालौन में बाइक सवार दो युवकों ने दिन दहाड़े एक छात्रा की गोली मारकर हत्या कर दी ।
गोदी मीडिया के भेड़िए और भाजपाई क्या इस मौत को भी सेलिब्रेट करेंगे?
pic.twitter.com/rowX9Y2HzX— Rashtriya Janata Dal (@RJDforIndia) April 17, 2023
Also Read: