భోపాల్: బీజేపీ నేత బంధువైన ఒక వ్యక్తి పారిశుద్ధ్య కార్మికులపై రెచ్చిపోయాడు. గన్తో వారిని బెదిరించడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ సంఘటన జరిగింది. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మనోజ్ పటేల్ బంధువైన మహేష్ పటేల్ పెట్రోల్ బంకు యజమాని. శనివారం ఉదయం ఇండోర్లోని వారి ఇంటి వద్దకు పారిశుద్ధ్య కార్మికులు వచ్చారు. అయితే తడి, పొడి చెత్తను వేరు చేయకపోవడంపై మహేష్ భార్య, పారిశుద్ధ్య సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, మహేష్ పటేల్తోపాటు అతడి కుమారుడు కూడా పారిశుద్ధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగాడు. వారిని చంపుతానంటూ కుమారుడు ముందుకు రాబోగా తల్లి అడ్డుకున్నది. ఆగ్రహం పట్టలేకపోయిన మహేష్ వెంటనే ఇంట్లోకి వెళ్లి గన్ తీసుకువచ్చాడు. తొలుత మొదటి అంతస్తు పైనుంచి గన్తో పారిశుద్ధ్య కార్మికులను బెదిరించాడు. అనంతరం కిందకు వచ్చి నేరుగా వారిపైకి తుపాకీని ఎక్కుపెట్టాడు. గాల్లోకి కాల్పలు జరుపడంతో పారిశుద్ధ్య కార్మికులు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీస్ అధికారి ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించాడు. అయితే చెత్తను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్ల సంఘం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. బాధిత పారిశుద్ధ్య కార్మికులతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. అయితే నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ పటేల్ బంధువు కావడంతో ఫిర్యాదు స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పారిశుద్ధ్య కార్మికులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
देश के सबसे साफ शहर इन्दौर में सफ़ाई कर्मचारी ने रोजाना गीला-सूखा कचरा मिलाने से टोका तो पूर्व बीजेपी विधायक के कथित रिश्तेदार ने पिस्तौल तान दी।
पुलिस ने आवेदन ले लिया है पर कुछ घंटे पुर्व तक मामला दर्ज नहीं हुआ था !pic.twitter.com/YnwahkOlVS
— काश/if Kakvi (@KashifKakvi) April 17, 2023