Uttar Pradesh | మంచంపై పరిచిన నోట్ల కట్టలతో తన భార్య, పిల్లలతో కలిసి సెల్ఫీ తీసుకుని ఓ పోలీసు అధికారి చిక్కుల్లో పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు సదరు పోలీసుపై చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో జరిగిందీ ఘటన.
వివరాల్లోకి వెళితే.. రమేశ్ చంద్ర సహానీ (Ramesh Chandra Sahani) ఉన్నావ్ (Unnao)లోని బెహ్తా ముజవార్ పోలీసు స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే అతను మంచంపై రూ.500 నోట్ల కట్టలను ఉంచి భార్య, పిల్లలతో సెల్ఫీ దిగాడు. అనంతరం ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీంతో అవికాస్తా వైరల్ గా మారి పై అధికారులు దృష్టికి చేరాయి.
దీంతో, ఈ ఘటనపై సీనియర్ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అంతేకాకుండా, సహానీని పోలీస్ లైన్స్కు బదిలీ చేశారు. ఈ ఘటనపై సహానీ స్పందించాడు. అది తన వారసత్వ ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బు అని స్పష్టం చేశారు. అదికూడా ఇప్పడు కాదని 2021 నవంబర్ 14వ తేదీదని తెలిపాడు. కాగా, ఫొటోలో కనిపించిన నోట్ల కట్టల విలువ మొత్తం రూ.14 లక్షల వరకూ ఉండొచ్చని సమాచారం.
Also Read..
Manipur Violence | మణిపూర్ లో మళ్లీ హింస.. ఇంఫాల్ లో బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
EMRS Recruitment 2023 | ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 4062 పోస్టులు
Uttar Pradesh | యూపీలో వందల్లో వడదెబ్బ మరణాలు.. విపరీత విద్యుత్తు కోతలే అసలు కారణం