కవాడిగూడ, జూలై 7: రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ డివిజన్ బ్యాంక్ బరోడా కాలనీలో రూ. 18 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించి సకాలంలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను జాప్యం చేయకుండా చూడాలని తెలిపారు. స్థానికులు అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని, అప్పుడే పనులు నాణ్యతగా జరుగుతాయని అన్నారు. రోడ్డు నిర్మాణాన్ని కాంట్రాక్టర్లు నాసిరకంగా చేపడితే ఫిర్యాదు చేయాలని ఆయన స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ అలీ, వై. శ్రీనివాస్రావు, ఉపాధ్యక్షుడు బింగి నవీన్కుమార్ నాయకులు శంకర్గౌడ్, షరీఫొద్దీన్, జీహెచ్ఎంసీ ఏఈ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.