న్యూఢిల్లీ, జూన్ 12: సివిల్ సర్వీసెస్- 2023 మెయిన్స్కు 14,624 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. ప్రిలిమినరీ ఫలితాలను యూపీఎస్సీ సోమవారం విడుదల చేసింది.
అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాసేందుకు త్వరలో దరఖాస్తులు సమర్పించాలని, అందుకు ప్రారంభ, చివరి తేదీలను త్వరలో వెల్లడిస్తామంది.