తిరువనంతపురం : కేరళలో వరుస పేలుళ్ల (Kerala Blasts) ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం పినరాయి విజయన్, కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ల మధ్య ఆరోపణులు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఎర్నాకుళం జిల్లాలో ఓ ప్రార్ధనా స్ధలంలో మూడు పేలుళ్ల ఘటనపై కేరళ ప్రభుత్వాన్ని విమర్శించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై కేరళ సీఎం పినరాయి విజయన్ విరుచుకుపడ్డారు. మతపరమైన అజెండాతోనే కేంద్ర మంత్రి వ్యాఖ్యలున్నాయని విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు.
మత అజెండాతో కాషాయ పార్టీ వ్యవహరిస్తోందన్న కేరళ సీఎం వ్యాఖ్యలను రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. పినరాయి విజయన్ అబద్దాల కోరని, ఎస్డీపీఐ, పీఎఫ్ఐ, హమాస్తో సంబంధాలు లేకుంటే మతతత్వ ముద్ర వేస్తారా అని నిలదీశారు. బీజేపీలో ఉన్న వారెవరికీ ఎస్డీపీఐ, పీఎఫ్ఐ, హమాస్తో లింకులుండవని తాను గర్వంగా చెప్పగలనని అన్నారు.
కేరళలోని మలప్పురంలో సాలిడారిటీ యూత్ మూమెంట్ నిర్వహించిన ర్యాలీలో హమాస్ నేత వర్చువల్గా పాల్గొనడాన్ని మంత్రి తప్పు పట్టారు. ఇవాళ పేపర్ చదువుతున్న ప్రతి ఒక్కరికీ పది రోజుల కిందట హమాస్ ఏం చేసిందనేది తెలుసని, వారు బాలికలు, యువతులపై లైంగిక దాడులకు పాల్పడి, ప్రజలకు గుండు కొట్టించారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Girlfriend dharna | నాలుగేళ్లుగా ప్రేమించి మొహం చాటేశాడు.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా