Road Accident | కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టీచర్ మృతి చెందగా.. ముగ్గురు విద్యార్ళు గాయపడ్డారు. మంత్రి ఛింద్వారాలో ఓ కార్యక్రమాన్ని ముగించుకొని నార్సింగ్పూర్కు తిరిగివస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. సింగోడి బైపాస్ సమీపంలోని ప్రైవేటు పాఠశాల నుంచి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుడు బైక్పై వస్తున్న సమయంలో మంత్రి కారు ఢీకొట్టింది.
ఆ తర్వాత ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థులను సైతం కేంద్రమంత్రి స్థానికుల సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో గాయపడ్డ ముగ్గురు చిన్నారులు నాగ్పూర్కు తరలించారు. ముగ్గురి చిన్నారుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ కాలికి సైతం స్వల్ప గాయమైంది. ప్రమాదం జరిగిన అనంతరం నార్సింగ్పూర్కు మరో వాహనంలో వెళ్లిపోయారు. అయితే, సంఘటనా స్థలంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు.