కోల్కతా : పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) తుది ముసాయిదా వచ్చే ఏడాది మార్చి 30 నాటికి సిద్ధమవుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మతపరమైన హింసకు గురై బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన మటువా కులస్తుల పౌరసత్వ హక్కును ఎవరూ లాక్కోలేరని నొక్కి చెప్పారు.
సీఏఏ రూపకల్పనకు సంబంధించి ఎదురవుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు.