న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. ఇప్పటికే పలువురు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మహమ్మారి బారినపడగా.. తాజాగా కేంద్ర హోం వ్యవహారాల సహాయమంత్రి నిత్యానంద రాయ్ గురువారం కొవిడ్కు పాజిటివ్గా పరీక్షలు చేశారు. దీంతో ఆయన హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. కరోనా బారినపడ్డట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తేలికపాటి లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేసుకోగా కొవిడ్ పాజిటివ్గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఒంటరిగా ఐసోలేషన్లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన వారంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. బుధవారం ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ శౌర్య ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిత్యానందరాయ్ పాల్గొన్నారు. అసోం రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన దళాలకు ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) కార్డులను పంపిణీ చేశారు. కేంద్రమంతి నిత్యానంద్ రాయ్ డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు బీహార్లో ఉన్నారు. పాట్నాలో బీజేపీ రాష్ట్ర మోర్చా కార్యక్రమంతో సహా వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇప్పటికే బిహార్ డిప్యూటీ సీఎం రేణుదేవి, తార్ కిశోర్ ప్రసాద్తో సహా నలుగురు మంత్రులు కరోనాకు పాజిటివ్గా పరీక్షలు చేసిన విషయం విధితమే.