న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వచ్చే ఏడాది జరుగనున్న జనగణన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కర్ణాటకలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచడానికే ఈ రిజర్వేషన్లు తెచ్చినట్టు వెల్లడించారు.
కాగా లోక్సభ, రాష్ర్టాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును సెప్టెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే.