45 రోజుల్లో డబ్ల్యూఎఫ్ఐకు ఎన్నికలు లేకుంటే సస్పెన్షన్ను ఎదుర్కోవాల్సిందే ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య హెచ్చరిక ఆధారాలు లేవని ఎవరు అన్నారు? త్వరలో కోర్టుకు నివేదిక: పోలీసులు బ్రిజ్కు పోక్సో చట్టం వర్తించదా?: సిబల్ నేడు ఎస్కేఎం దేశవ్యాప్త ఆందోళన ముజఫర్నగర్లో మహాపంచాయత్ 4న ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆందోళన బ్రిజ్పై నిష్పక్షపాత దర్యాప్తునకు ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, ఐవోసీ డిమాండ్
Meenakshi lekhi | రెజ్లర్ల ఆందోళనపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఢిల్లీలో ఓ కార్యక్రమానికి వచ్చిన మీనాక్షి లేఖిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి ‘రెజ్లర్ల ఆందోళనపై మీ స్పందనేంటి?’ అని అడిగారు. దీనికి ఆమె సమాధానం చెప్పకుండా పరుగులు పెట్టారు. దీంతో విలేకరులు కూడా ఆమెను అనుసరిస్తూ.. అదే ప్రశ్నను మళ్లీ అడిగారు. ఇందుకు ఆమె‘చలో చలో..’ అంటూ పరుగెడుతూ కారు ఎక్కి వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో మోదీ సర్కార్ తీరుపై సెటైర్లు వస్తున్నాయి. రెజ్లర్ల విషయంలో కేంద్రం తీరును వారి మంత్రులు, నేతలే సమర్ధించలేకపోతున్నారని.. ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. మరోవైపు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్భూషణ్ను డబ్యూఎఫ్ఐ పదవి నుంచి తొలగించాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కుస్తీవీరులు దాదాపు గత 40 రోజులుగా ఆందోళన చేస్తుంటే.. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా స్పందించారు. విచారణ పూర్తయ్యే వరకు వేచిచూడాలని, అప్పటి వరకు క్రీడకు హాని కలిగించే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నిరూపిస్తూ తానే ఉరేసుకొంటానంటూ బ్రిజ్భూషణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని రామ్నగర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.