Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందని రాష్ట్రంలో 25 ఎంపీ స్ధానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి కైలాష్ చౌధరి పేర్కొన్నారు. రాజస్ధాన్లో విపక్షం ఉనికి లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్లో ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని, క్షేత్రస్ధాయిలో ప్రధాని మోదీ చేపట్టిన పనులు, ఆయనపై విశ్వాసం కాషాయ పార్టీకి ఈ ఎన్నికల్లో కలిసివస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓటమిని కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, కాంగ్రెస్ నేతలు ప్రచారం కూడా చేయడం లేదని అన్నారు. సర్వేలు సైతం రాజస్ధాన్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. బార్మర్ నియోజకవర్గంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన పనులను తిరిగి చేపడతామని చెప్పారు.
పలు కేంద్ర పధకాలను ఈ ప్రాంతంలో తాను అమలుచేస్తున్నానని తెలిపారు. వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయని, ఎయిర్పోర్ట్ ఈ నియోజకవర్గానికి కేటాయించారని, ఎన్నో హైవేలను నిర్మించారని గుర్తు చేశారు. రిఫైనరీ ప్రాజెక్టులపై కసరత్తు సాగుతోందని, రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు.
Read More :
Tejashwi Yadav | ఆయన మాపై ఎన్ని విమర్శలు చేసినా అవి మాకు ఆశీస్సులే..: తేజస్వీ యాదవ్