పాట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు. వ్యక్తిగత దూషణ వల్ల బీహార్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం నితీశ్ మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్ చాలా మంది పిల్లలకు జన్మనిచ్చారు. వంశపారంపర్య రాజకీయాల కోసం వారికి శిక్షణ ఇస్తున్నారని విమర్శించారు. తన కుటుంబ సభ్యులను మాత్రమే లాలూ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నువ్వు ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడం అవసరమా? ఎవరైనా చాలా మంది పిల్లలను కంటారా?’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల పట్ల తేజస్వీ ఫైర్ అయ్యారు.
‘ఆయన మా గురించి ఏదైనా మాట్లాడవచ్చు. ఎన్ని విమర్శలు చేసిన అవి మాకు ఆశీస్సులే. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు బీహార్ ప్రజలకు ఏమైనా లాభం చేకూరుస్తాయా అని ప్రశ్నించారు. ‘ఎన్నికల్లో సమస్యలను గురించి చర్చ జరగాలి. ఇలాంటి చెత్త ఉపన్యసాలు ఆయనకు ఎవరు రాసిస్తున్నారు. ఆయన విద్య, నిరుద్యోగం, వలసల గురించి మాట్లాడితే బాగుంటుంది. నితీశ్ ఏం చెప్పదలుచుకున్నారో బీహార్ ప్రజలు గమనిస్తున్నారు. ప్రధాని మోదీ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడటం మానేశాక.. నితీశ్ మొదలు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
#WATCH | Patna: On Bihar CM Nitish Kumar’s remarks, Former Deputy CM of Bihar RJD leader Tejashwi Yadav says, “He can say anything to us. Whatever he says is like a blessing for me… But the thing is, will such personal remarks benefit the people of Bihar… In elections, issues… pic.twitter.com/i4RYvYlLjk
— ANI (@ANI) April 20, 2024
‘నువ్వు చాలా మంది పిల్లలను కన్నావు. ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడం అవసరమా? ఎవరైనా చాలా మంది పిల్లలను కంటారా?’ అని నితీశ్ కుమార్ ప్రశ్నించారు. మరోవైపు ప్రస్తుతం తన కుమార్తెలు, ఇద్దరు కుమారులు, కుటుంబంలోని ప్రతి ఒక్కరిని రాజకీయాల్లోకి లాలూ తీసుకువచ్చారని విమర్శించారు. వారు ప్రతిచోటా ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ప్రజలు పాత విషయాలు మరచిపోతారు. కాబట్టి, ఏ పనీ జరుగదని అందరికీ చెప్పాలనుకుంటున్నా. ప్రజలు బయటకు రాలేకపోయారు. రోడ్లు కాని విద్య కాని లేవంటూ లాలూ వారసత్వ రాజకీయాలపై బీహార్ సీఎం మండిపడ్డారు.
#WATCH | Katihar: Bihar CM Nitish Kumar says, “Some people claim everything these days. They appointed their wives when they were removed. Now, it is their children these days. ‘Ab paida to bahut kar diya. Itna zyaada paida karna chahiye kisi ko, baal baccha?’… Now they have… pic.twitter.com/x8Q8GdKz0W
— ANI (@ANI) April 20, 2024