Jyotiraditya Scindia : కేంద్ర మంత్రి, గుణ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి జ్యోతిరాదిత్య సింధియా తన నామినేషన్ పత్రాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. నియోజకవర్గ ముఖ్య నేతలు జ్యోతిరాదిత్య సింధియా వెంట ఉన్నారు.
#WATCH | Lok Sabha elections 2024 | Madhya Pradesh: Union Minister and BJP candidate from Guna, Jyotiraditya Scindia files his nomination for general elections.
CM Mohan Yadav and former CM Shivraj Singh Chouhan are also with him. pic.twitter.com/MS2SUtCFO8
— ANI (@ANI) April 16, 2024
ఈ నియోజకవర్గం నుంచి జ్యోతిరాదిత్య సింధియాతో కాంగ్రెస్ అభ్యర్ధి యద్వేంద్ర సింగ్ తలపడనున్నారు. లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్లో మే 7న గుణలో పోలింగ్ జరగనుంది. ఏడు దశల్లో పోలింగ్ ముగిసిన అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Manda Jagannath | కాంగ్రెస్ పార్టీని వీడనున్న మందా జగన్నాథ్..!