గువహటి: అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్యకు పీఎం కిసాన్ సంపద యోజన కింద రూ.10 కోట్ల రాయితీ మంజూరు అంశం దుమారం రేపుతున్నది. దీనిపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని హిమంత ప్రకటించగా, రాయితీ ఇచ్చినట్టు కేంద్రమే లోక్సభలో సమాధానమిచ్చిన అంశాన్ని విపక్షాలు లేవనెత్తుతున్నాయి. గత మార్చిలో లోక్సభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అందించిన సమాచారం ప్రకారం…
కిసాన్ సంపద యోజన పథకం కింద ‘ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్’కు (అస్సాం సీఎం భార్యకు చెందిన కంపెనీ ఇది) గ్రాంట్ ఇన్ ఎయిడ్గా రూ.10 కోట్లు అందాయి. ఈ విషయంలో కేంద్ర మంత్రి అబద్ధం చెబుతున్నారా? లేక హిమంత అబద్ధం ఆడుతున్నారా? అని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది. కాగా, ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్పై రూ.10 కోట్ల పరువునష్టం దావా వేస్తానని హిమంత భార్య రినికి భూయాన్ తెలిపారు.