ముంబై : నాసిన్లోని డాక్టర్ జకీర్ హుస్సేన్ హాస్పిటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ లీకై ప్రాణవాయువు అందక 22 మంది రోగులు మృతిచెందిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
నాసిన్ ఘటన దురదృష్టకరమని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ టోపే అన్నారు. పరిస్థితిపై నాసిక్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడానని, ప్రస్తుతానికి అంతా అదుపులోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
తాను నాసిక్ బయల్దేరి వెళ్తున్నట్లు తెలిపారు. స్థానిక మంత్రి చాగన్ భుజ్బల్ ఇప్పటికే ఘటనాస్థలానికి చేరుకున్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి రాజేశ్ టోపే చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి