న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: పక్క దేశం నుంచి ఎవరైనా వచ్చి భారత్లో ఉగ్రవాద కా ర్యకలాపాలకు పాల్పడినా, దేశంలో శాం తి భద్రతలకు భంగం కలిగించినా ఊరుకునేది లేదని, వారికి తగిన జవాబు ఇస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఏరివేసే ప్రణాళికలో భాగంగా పాకిస్థాన్లో భారత గూఢచార సంస్థలు దాదాపు 20 మందిని మట్టుబెట్టాయని బ్రిటన్కు చెందిన ‘ది గార్డియన్’ పత్రికలో వచ్చిన వార్తపై రాజ్నాథ్ శనివారం స్పందించా రు.
ఈ వార్త అవాస్తవమని, భారత్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే, ఎవరైనా భారత్లో ఉగ్రవాద కార్యకలాపాల కు పాల్పడి పాకిస్థాన్లోకి పారిపోతే మా త్రం ఊరుకోమని, ఆ దేశంలోకి వెళ్లి మరీ మట్టుబెడతామని ఆయన స్పష్టం చేశా రు. ప్రధాని మోదీ చెప్పినట్టుగా భారత్ సామర్థ్యాన్ని పాకిస్థాన్ కూడా అర్థం చేసుకోవడం ప్రారంభించిందన్నారు.
ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాల ను నెరపాలనేది భారత్ విధానమని, భారత్ ఒక్కసారి కూడా ఇతర దేశాలపై దాడి చేయలేదని, ఇతర దేశాల భూభాగాల్లో ఒక్క అంగుళాన్ని కూడా ఆక్రమించలేదన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్లో కలుస్తామని డిమాండ్ చేస్తున్నారని, ఈ మేరకు పలు ప్రదర్శనలు నిర్వహించారని రాజ్నాథ్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్దేనని స్పష్టం చేశారు. కాగా, సింగ్ వ్యా ఖ్యలకు పాకిస్థాన్ కౌంటర్ ఇచ్చింది.