న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వేస్లో పని చేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు( RPF/RPSF సిబ్బంది మినహా) 78 రోజుల వేతనం బోనస్గా ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో 11.50 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఏడు పీఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అపరెల్ పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఐదేళ్లలో రూ. 4,445 కోట్లతో పీఎం మిత్ర పార్కులు ఏర్పాటు చేయనుంది.