న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు 2022-23 బడ్జెట్ను లోక్సభలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొవిడ్ మహమ్మారి దృష్ట్యా పార్లమెంట్ ఉభయ సభలు రెండు షిఫ్టుల్లో పని చేయనున్నాయి. కొవిడ్ ప్రోటోకాల్స్ మేరకు వచ్చే నెల 1న లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మినహా రాజ్యసభ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనున్నది. లోక్సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేయననున్నది.
ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు రెండు విడుతల్లో జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం సమావేశాల ప్రారంభం తొలి రోజున ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సెంట్రల్ హాల్, లోక్సభ, రాజ్యసభ చాంబర్లు, గ్యాలరీల్లో సభ్యుల కోసం సీటింగ్ ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు భౌతికదూరం ఉండేలా చర్యలు చేపట్టారు.