న్యూఢిల్లీ, జూలై 14: ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై పౌరుల అభిప్రాయాలు తెలిపే గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్టు లా కమిషన్ శుక్రవారం ప్రకటించింది. ప్రజలు తమ అభిప్రాయాలను లా కమిషన్ వెబ్సైట్కు సమర్పించవచ్చని పేర్కొంది.
ఉమ్మడి పౌర స్మృతి అమలైతే తాను చీర కట్టుకోవాల్సిందేనని, మిగిలిన వారు కూడా అదే పనిచేయాల్సి ఉంటుందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐదేండ్ల పాటు మాంసాన్ని తినడం మానేయాలని అన్నారు. పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలు, చైనా దురాక్రమణ లాంటి ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేంద్రం యూసీసీపై చర్చ పెడుతున్నదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఉమ్మడి పౌర స్మృతిపై తమ పార్టీ అభిప్రాయాన్ని లా కమిషన్కు పంపినట్టు ఆయన చెప్పారు.