లక్నో : ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని లక్నో-కాన్పూర్ హైవేపై ఆజాద్ మార్గ్ క్రాసింగ్ వద్ద అదుపుతప్పిన డంపర్ పలు వాహనాలను ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఉన్న వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు సహా ఆరుగురు మృతి చెందారు. అచల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజాద్ మార్గ్ కూడలి వద్ద ఆదివారం రాత్రి అదుపుతప్పి డంపర్ కారు, బైక్ను ఢీకొట్టి పాదచారులపైకి దూసుకెళ్లింది.
అదే సమయంలో డంపర్ ఓ వాహనాన్ని కాలువలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు, అల్లుడు మృతి చెందారు. ప్రమాదం అనంతరం గ్రామస్తులు హైవే దిగ్బంధించారు. రాళ్ల దాడి చేయడంతో బస్సు ధ్వంసమైంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్పై సైతం దాడికి పాల్పడ్డాడు. పోలీసు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.